టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఫ్లెక్సీ దిష్టి బొమ్మ దహనం

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఫ్లెక్సీ దిష్టి బొమ్మ దహనం

నిరసనలో పాల్గొన్న మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక,ముద్ర: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ వద్ద భారత రాష్ట్ర సమితి  ఆధ్వర్యంలో బుధవారం నాడు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఫ్లెక్సీ దిష్టిబొమ్మనుదహనం చేశారు మెదక్ పార్లమెంట్ సభ్యుడు సిద్దిపేట జిల్లా బారాస అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం 24గంటలు కరెంటు ఇస్తుంటే ఓర్వలేని రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్  సరిపోతుందని అనడం సిగ్గుచేటు అన్నారు.

రైతాంగాన్ని నిండా ముంచాలనే కుట్రలో భాగమే రేవంత్ రెడ్డి చేసిన 3గంటల కరెంటు సరఫరా అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలే అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,దుబ్బాక మండల అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ,నాయకులు గోనెపల్లి సంజీవరెడ్డి, ఖలీల్, అస స్వామి, చెక్కపల్లి పద్మయ్య తదితరులు పాల్గొన్నారు.